మరణం అనేది స్కూల్ లో ఇచ్చే విశ్రాంతి వంటిది. కొద్ది సమయం తరువాత మరల తిరిగి తరగతులు తిరిగి ప్రారంభం అవుతాయి. మరణం తరువాత ప్రతి మనుషుడు ఆత్మ రూపంలో బ్రతికే ఉంటారు కాని దేవుడు వారికి సిద్ధపరరచిన స్థలములో ఉంటారు. కొద్ది కాలం తరువాత వారిని తన వెంటపెట్టుకుని వస్తాను అని ప్రభువు వారు చెపుతున్నారు. 1 దేస్స 4: 14. అంటే మనం ప్రభువులో ఉన్నవారమైతే మనం విశ్రాంతి తరువాత మరల అందరం కలసి జీవితాన్ని కొనసినగించగలము. నిత్యత్వము లో మనం దేవుని సన్నిధిలో ఉంటాము. అందుకే వాక్యం చెపుతుంది ప్రభువు నందు నిద్రించిన వారిని బట్టి ఎడ్వవద్దుఅని హెచ్చరిస్తున్నాడు ( 13 వ ) . నేను ప్రతిరోజు ఏదో ఒక స్థలానికి వెళ్తుంటాను. నేను వెళ్ళేటప్పుడు నా బార్యకు, పిల్లలకు, ఇంట్లో వారికి, ఇంకా అక్కడ ఉన్నవారందరికీ చెపుతాను. కాని ఏ ఒక్కరు కూడా నన్ను చూసి ఏడ్వరు. ఎందుకంటే నేను మరలా వస్తాను అనే నమ్మకం. అందునా మనం ఎవరైనా అలా దురం వెళ్తుంటే ఏడుస్తూ పంపించకండి అంటారు. అయితే ఈ ప్రయాణాల మీద నమ్మకం లేదు కాని ఇచ్చిన మాట నెరవేర్చ గల దేవుడు నమ్మదగిన వాడు. ఒక రోజు మనకంటే ముందుగా మరణించిన వారిని కలుస్తాము. గనుక వారి కొరకు దుఖించక క్రీస్తునందు నిరిక్షనతో వారి కొరకు ఎదురుచుదాము....
షలోమ్
మీకొరకుప్రార్ధించే
అపోస్తులునెల్లినానిబాబు