నేను ఒక రోజు ఒక మంచి పెద్ద హోటల్ కి వెళ్ళాను. అందులోకి వెళ్ళగానే ఒకతను మేము కోర్చోవలసిన టేబుల్ చూపించాడు. అక్కడ కూర్చోగానే ఒకతను వచ్చి ఒక బుక్ టేబుల్ మీద పెట్టి మరల వస్తాను అని వెళ్లి పోయాడు. కాసేపటికి మరల వచ్చాడు. అందులో మాకు నచ్చినవి ఎంచుకుని అతనికి చెప్పాము. కాసేపటికి మరో అతను వచ్చి టేబుల్ మీద అన్ని సదిరి, బోజనానికి ప్లేట్స్ పెట్టి, మేము ఆర్డర్ చేసినవన్నీ పట్టుకొచ్చి ఎలా వడ్డించ మంటారు అని అడిగి మాకు ఎలా కావాలో అలానే వడ్డిస్తూ, ఇంకా ఏమైనా కావాలా సార్, అని అడుగుతూ మేము భోజనం చేసి పూర్తయ్యేవరకు ఉండి బిల్ తనకే ఇస్తే కట్టేసి వచ్చాడు, తనకు కొంత టిప్ ఇచ్చాం. బయటకు వస్తున్నప్పుడు నాకు ఎందుకో బైబిల్ లోని వచనం గుర్తుకు వచ్చింది. హెబ్రీ 1:13 ,14 దేవుడు ఎంత గొప్ప వాడు కదా! మనలను భూమి మీదకు పంపి, మనకు అవసరమయిన పనులు చేయడానికి మనకు పరిచారకులను ఏర్పరిచారు, హోటల్ వెయిటర్ వలె. వాళ్ళు మనలకు అవరమైన వన్ని చేయడానికి సిధంగా ఉన్నారు. కాని మనమే వారికీ ఏ పని అప్పచెప్పడం లేదు. యేసు వారు కూడా అన్నారు కదా పెతురుతో గేత్సేమనే తోటలో , నేను ప్రార్ధిస్తే, అడిగితే 12 వ్యుహాములకంటే ఎక్కువ అయిన పరలోక సైన్యాన్ని పంపరు అనుకుంటున్నావా? అని. అంటే ఎంత మంది అనుకుంటున్నారు, 72 వేలు. అంటే నీవు ప్రార్ధిస్తే, అడిగితే నీకు పరిచర్య చేయడానికి దేవుడు తన దూతలను నీ దగ్గర ఉంచారు. ప్రార్ధించి దేవున్ని అడుగు, బయపెట్టే సాతనును తరవమని, వారు తరిమేస్తారు. అసిర్వాదానికి అడ్డు వచ్చే ప్రతి ఆటంకము ను తరిమి కొట్టమను, జరుగుతుంది. మరి దేవుడు నీకు అప్పగించిన పరిచారకులను వాడుకుంటున్నావా
దేవుడు మీకు తోడుగా ఉన్నారు అని మరచి పోకు,
ప్రభువు మిమ్మును దివించును గాక
మీ సహోధురుడు
అపోస్తులు నాని బాబు నెల్లి