యేసు వారు ఒక రోజు యూదయ ప్రాంతాన్ని దర్శించడానికి వెళ్తే అక్కడికి జనాలు సమూహాలుగా యేసు వారి దగ్గరకు వచ్చారు. అక్కడే అని కాదు ఎక్కడికి వెళ్ళిన భహు జన సమూహములు యేసు వారి దగ్గరకు వచ్చేవారు. యేసు వారి దగ్గరకు నాలుగు రకాలైన జనాలు వచ్చే వారు. 1) స్వస్తతలు కోసం, మేలు కోరి వచ్చే వారు, 2) యేసు వారు చేసే కార్యాలు చూడటానికి వచ్చేవారు ౩) యేసు వారిని ప్రశ్నించి తప్పు పట్టుకోడానికి వచ్చేవారు 4) యేసువారిని అర్ధం చేసుకుని నిజముగా యేసును వెంబడించే వారు. అయితే చాల తక్కువ సార్లు పిల్లల ప్రస్తావన ఉంది. మార్కు 10: 13 లో కొంతమంది తమ పిల్లలను యేసు వారి దగ్గరకు తీసుకుని వచ్చారు. ఎందుకు వారు తీసుకుని వచ్చారు. మిగతా వారు తీసుకుని రాలేదు. వారి ఆలోచన లో తమ తరువాతి తరం కుడా అసిర్వదించ బడాలని కోరిక కలిగింది. చిన్న నాటి నుండే వారిని యేసు చెంతకు రావడం నేర్పుతున్నారు. వారి కి నడువ వలసిన త్రోవను నేర్పుతున్నారు. యేసు వారు వారిని ఎత్తుకుని కౌగలించుకుని వారి మీద చేతులు ఉంచి ఆసిర్వధించెను. ఈ రోజు నీ పిల్లల పరిస్థితి ఏంటి? ఒకసారి ఆలోచించుధామా ? ప్రభువు మీ పిల్లలును ఆసిర్వాధించును గాక!
షలోమ్
మీ బిడ్డల క్షేమం కోరి ప్రార్ధించే
అపోస్తులు నాని బాబు నెల్లి