నాకు తెలిసిన ఒక సహోదరుడు తనకు ఉన్న ఒక అలవాటును తెలియజేసాడు. వినడానికి కొంచెం ఇబ్బంధింగా ఉన్నప్పటికీ అందులో ఉన్న విషయం నన్ను ఆలోచింపచేసింది. తనకు ఎప్పుడైనా కడుపులో గాబరాగా గాని, ఇబందిగా గాని అనిపిస్తే దానికి కారణం ఏంటి అని అలోచించి ఒకవేళ తను తిన్న ఆహారం అయితే వెంటనే కంటములో వేలిపెట్టి తిన్నది అంత బయటకు వచ్చే వరకు వాంతులు చేసుకుంటాడు. తనను ఇబందికి గురిచేసిన ఆ ఆహారం మరల తిసుకోడు. ఇదే రకపు అలవాటు ప్రాచిన రోమా ప్రజలోలో ఉండేది. కాని అది ఆహారం మీద కోరిక సావక మల్లి మల్లి తినడానికి చేసేవారు. అయితే ఇక్కడ ఉన్న ఇద్దరు కూడా మనకు మంచి పాటాన్ని ఇస్తున్నారు. మన జీవితం లో మనకు అనేక రకాలైన సమస్యలు, శోధనలు, ఇబ్బందులు ఎదురౌతుంటాయి, మనస్సులో సమాధానం లేకపోవడం, సహోదరులతో సంతోషంగా గడపలేకపోవడం, బార్య బర్తల మధ్య వివాదాలు ఇంకా ఎన్నో ఉంటాయి... అయితే వాటికి కారణం ఏంటి అని తెలుసుకుని వాటిని వాంతు చేసుకోగలగాలి. అంటే వాటిని మన ఉదరం అనే జ్ఞాపకాలు, అలవాటు, జీవితం నుండి తీసి వేసేసుకోగలగాలి. అయితే మరల అలంటి క్రియలకు దూరంగా ఉండాలి. అదే మారుమనస్సు, నూతన జీవితం. అదే నీ జీవితమలో ఆనందానికి, సంతోషానికి, సమాధానికి పునాది. అలాకాదు అనుకుంటే సరియయిన ఆహారం తీసుకోనని శరీరం రోగాలకు నెలవు అయ్యినట్టు నీ జీవితం సమస్యలకు మెట్టిన ఇల్లు అవుతుంది. దయతో బైబిల్ లో సామెతలు 26:11 చదవండి.
ప్రభువు మిమ్మును సమస్యలను అధిగమించు వారిగా బలపరచును గాక!
ప్రభువు రాయబారి,
అపోస్తులు నాని బాబు నెల్లి,