అందరం అనుకుంటూ ఉంటాం మనం ఎంత సంపాదించినా చనిపోయాక అన్నింటిని వదిలి వెళ్లిపోవాలి అని. అందుకు ఎందుకు సంపాదించుకోవడం అనుకుని నిరాశ పడుతుంటాం. కాని వాక్యం చెపుతున్నది ఏంటి అంటే. నిన్ను ఇలోకం లో ఉన్నవాటిని సంపాదించు కోవద్దు అని ఏనాడూ చెప్పలేదు. భాగ్యం సంపాదించు కొనుటకై మీకు సామార్ధ్యము కలుగ జేయువాడు ఆయనే ( ద్వితి 8:18 ) అని వాక్యం చెపుతుంది. ఇలోకం లో మనలను ధనవంతులుగా చూడాలని మన తండ్రి కోరిక. అయితే మరో మాటలో " మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండనేరరు ( మత్తయి 6:24 ) " అని, ఇదియు గాక ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశించుట కంటే సూది బెజ్జములో ఒంటె దురుట సులభమని మీతో చెప్పుచున్నాను ( మత్తయి 19:24 ) అని ధనముకు వ్యతిరేకముగా మాట్లాడినట్లు మనకు కనపడుతుంది. భాగ్యం ఇచ్చి పరలోకానికి దూరం చెయ్యడం దేవుని ప్రణాలికా? ఇక్కడ బాగా అర్ధం చేసుకోగలిగితే నీకు భాగ్యం యిస్తారు అయన కాని నీవు దానికి బానిసావు కాకుండా అదే నీకు భానిసగా ఉండాలి అని అయన ఉద్దేశ్యం. ఒకవేళ నీవే దానికి బానిసవు అయితే నీవు పరలోకానికి వెళ్ళలేవు అని అయన హెచ్చరిక. ఎలా? చనిపోయినప్పుడు ఇదేమి రాదు కాదా అనుకుంటున్నాము మనం. కాని దేవుడు నీకు ఇచ్చిన భాగ్యం తో నీవు ఏమేమి చేసావో అవన్నీ, నీ క్రియలు నీ వెంట వస్తాయి అని వాక్యం చెప్పుతుంది.( ప్రకటన 14:13 ). ఉదాహరనకు ఫోన్ కొనుకోడానికి దేవుడు సమార్ధ్యాన్ని ఇచ్చారు, నీవు చని పోయాక ఫోన్ ఇక్కడే ఉండిపోతుంది, కాని ఫోన్ తో నీవేమి చేసావో అది వస్తుంది. అందుకే జాగ్రత్త నిధగ్గరకు ధనం వచ్చినప్పుడు దాన్ని నీ బానిసగా చేసుకో, అది చేయ్యమన్నట్టు నీవు చెయ్యకు.
ప్రభువు నీకు విస్తారమైన ధన సమృద్ధిని అనుగ్రహించును గాక!
మీ సహోదరుడు
అపోస్తులు నాని బాబు నెల్లి