నేను ఒక చోట గోడమీద వ్రాసిన నోటిన్ చూసాను. ఇది అటో స్టాండ్ ఇక్కడ బైకులు నిలుపరాదు. కాని బోర్డు ఎదురుగుండానే బైకులు పెట్టి ఉన్నాయి. మన దేశం లో నోటిస్ లను, హెచ్చరికలను పట్టించుకోము. "ఇక్కడ చెత్త వేయరాదు" చూస్తాము, చదువుతాము కాని చెత్త అక్కడే వేస్తాము. హెచ్చరికలకు ప్రాధాన్యత ఇవ్వము. వాటిని పెడచెవిన పెడతాము. అలా చేయడం వలన ఒక గొప్ప ప్రమాదం దాగి ఉంది. థాయ్లాండ్ లో ఒక సారి ఒకతను జిబ్రా క్రాసింగ్ లో నడవకుండా పక్కనుండి నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు వెంటనే పోలీస్ ఆపి ఫైన్ కట్టమన్నాడు. ఆ వ్యక్తి రోడ్ కాలిగానే ఉంది కాదా, వాహనాలు ఏమి రావడం లేదు కదా అన్నాడు. అందుకు కాదు ఫైన్ చిన్నపిల్లలు చూస్తుండగా నీవు తప్పు చేసావు, నీవల్ల రాబోయే తరం క్రమంలేకుండా ఉండే అవకాసం ఉంది అందుకే నీకు ఫైన్ అన్నాడు అంటా. మనం హెచ్చరికలను విస్మరించి జీవించడం వలన అలవాటుగానే ఎన్నో సమస్యలలో పడుతున్నాము. సిగరెట్ త్రాగడం వలన కేన్సర్ వస్తుంది అని పెట్టేమిద వ్రాసిన పట్టించుకోవడం లేదు, ప్రమాదకర ప్రదేశం మెల్లగా వెళ్ళండి అని చూస్తాం అయిన వేగంగానే వెళ్తున్నాం, పాపం చెయ్యకు మరణిస్తావు అని చెప్పినా, తెలిసినా చేస్తూనే ఉన్నాము, ప్రార్ధనకు సమయానికి వెళ్ళాలి అని తెలుసు అయిన వెల్లం, కారణం ఇప్పటి ముందు తరం వారు హెచ్చరికలను నిర్లక్షం చేయడం నేరిపించారు. మన తరువాతి తరాలకు అదే మార్గం అలవాటు చేస్తున్నాం, మనకు తెలియకుండానే మన భవిష్యత్ తరాలను చీకటి లోనికి నేట్టేస్తున్నాము. ఎక్కడైన్ హెచ్చరిక వుంటే దానిని కచ్చితంగా పాటించి చుడండి, మీ పిల్లలు కుడా అలానే ఉంటారు. హెచ్చరికలను చదివి పాటించడం నేర్చుకోండి, నేర్పించండి. అదే క్రమశిక్షణ. క్రమశిక్షణ కలిగిన వారి జీవితాలు వేలుగుమయంగా ఉంటాయి. సమయాన్ని పాటించడం అలవాటు అవుతుంది, జీవితాలు దివేనకరముగా ఉంటాయి, అనేక మందికి స్పూర్తిదాయకంగా ఉంటాయి. అన్నిటి యందు నేన్ను నీవే సత్కార్యముల విషయమై మాదిరిగా కనుపరచుకోనుము. తీతు 2:7. ప్రభవు మిమ్మును మీ బిడ్డలను సమాజానికి మాదిరులుగా చేయును గాక!
షలోమ్
మీకోరకు ప్రార్ధించే
అపోస్తులు నెల్లి నాని బాబు