యేహెజ్కేలు 47 వ అధ్యాయం లో ఒక నది ఉన్నది. ఆ నది ప్రవహించే చోటల్ల 4 విషయాలు జరుగుతున్నాయి. మొదటిది జీవం కలుగుతుంది, రెండవది ఆహారము మూడవది ఆరోగ్యము నాల్గవది ఆశీర్వాదం. ప్రతి ఒక్కరి జీవితంలో ఇవన్నీ అవసరమే కదా! అయితే ఆ నది ఎక్కడి నుండి ప్రవహిస్తుందో తెలుసా మొదటి వచనం లో చదివితే అది మందిరపు గవిని నుండి ప్రవహిస్తున్నట్లు తెలుస్తుంది. నీకు పై ఆసిర్వధాలు కావాలంటే మందిరమునుండి ప్రవహించే జీవ వాక్యమును నీ జీవితం లో ప్రవహించనివ్వాలి. సమరయ స్త్రీ ఆ నీటిని ఆస్వాదించింది కాబట్టి రోత జీవితం మారి గొప్ప సాక్తిగా మారింది. మరి నీవు మందిరానికి వెళ్తావా? వెళ్లి దీవెనలు పొంధగాలవా? అయితే ఇంకెందుకు ఆలస్యం... ప్రభువు మందిరం లోని పైన ఉన్న దివేనలతో నింపును గాక!
షలోమ్
మీకోరకు ప్రార్ధించే
అపోస్తులు నెల్లి నాని బాబు