కీర్తనలు 132: 13 – 15. యెహోవా సీయోనును ఏర్పరచుకొని యున్నాడు. తనకు నివాసస్థలముగా దానిని కోరుకొని యున్నాడు. ఇది నేను కోరినస్థానము, ఇది నిత్యము నాకు విశ్రమ స్థానముగా నుండును ఇక్కడనే నేను నివసించెదను. దాని ఆహారమును నేను నిండారులుగా దీవించెదను దానిలోని బీదలను ఆహారముతో తృప్తిపరచెదను. దేవుడు సియోనును నివాసముగా, విశ్రమ స్థానముగా కోరుకుని నిత్సయించు కున్నాడు. సియోను దేవుని ఇంటిగా మారిపోయింది. దేవుడు ఆది నుండి మానవులతో కలసి ఉండాలని ఆశ పడేవారు ( నిర్గమ 25:8 ). అందుకే ఆదాము అవ్వలతో అయన సమయాన్ని గడిపేవారు. కాని వారు పాపం చెయ్యడం వలన దేవుడు వారితో ఉండలేక పోయారు. అయితే అయన ఈ భూమి మీద సియోనును మాత్రమె నివాస స్థలం అన్నారు. అది అక్కడ కొండలు నచ్చి కాదు. అక్కడ దావీదు ఏర్పరచిన నిత్య స్తుతి ఆరాధన ఆయనకు నచ్చి అక్కడ ఉంటాను అన్నారు. అయన అక్కడ ఉన్నారు కాబట్టి పట్టణంలో, అక్కడ ఆహారం సమృది గా ఉంచుతాను అన్నారు. అంటే అక్కడ వ్యవసాయం బాగా పండుతుంది, అంటే అక్కడ నీటి సమస్య లేదు, కొండ ప్రాంతం అయిన నీరు సమ్రుధిగా ఉంది, అంటే అక్కడ నిరుద్యోగ సమస్య లేదు, ఆకలి చావులు లేవు, బిధవాడే లేడు, సమృది అయిన ఐశ్వర్యం, నెమ్మది, క్షేమం. ఇంకా నీకు తెలిసినవి... మరి నీ ఇంట్లో ఎలా ఉంది... నీ జీవితం లో ఎలా ఉంది? నీవు మారు మనస్సు పొంది దేవుని స్తుతించే కుటుంబం గా నీవు ఉంటె.... నీ ఇంటిని, సంఘాన్ని అయన తన నివాస తలముగా మార్చు కుంటాడు. పైన చెపిన దీవెనల పంట నీవు కోతువు గాక!
షలోమ్
మీ కొరకు ప్రార్ధించే,
అపొస్తులు నాని బాబు నెల్లి,