సోలోమోను తన యాత్ర కీర్తన 128 లో నీ పిల్లలు ఒలివ మొక్కవలె ఉంటారు అని చెప్పాడు. అసలు దేవుడు మన పిల్లల్ని ఒలివ మొక్కలుకు పోల్చడం లోని అంతర్యాన్ని జ్ఞాపకం చేసుకోడానికి ప్రయత్నిద్దాం. ఒలివ మొక్క కు ప్రత్యేకత ఉంది. ఆది కాండం లో గొప్ప జలప్రళయం వచ్చినప్పడు ఒక సంవత్సరకాలం నవాహు తన కుటుంభం, జంతువులు ఓడలో ఉన్నారు. భూమి మీద నీరు తగ్గిందా అనే విషయం తెలుసుకోడానికి ఒక పావురమును పంపగా అది తిరిగి వచ్చేటప్పుడు తన నోటితో ఒక ఒలివ చిగురును పట్టుకుని వచ్చింది. ఒక సంవత్సరం కాలం భూమి అంతా నీటితో నిండి పోగా ఆ నీటి ఊటకి అన్ని చెట్లు మరణించి ఉంది ఉండవచ్చు కాని ఒలివ చెట్టు మాత్రం నీరు తలకు పైగా ప్రవహిస్తున్న చిగిరిస్తూ నీటి ఉపరితలముకు రావడానికి పెరుగుతూ వస్తుంది. అది సచ్చిపోలేదు బ్రతికి ఉంది, ఆగిపోలేదు పెరుగుతూ ఉంది, నీటికి వంగిపోలేదు ఉపరితలముకు పొడుచుకుని వస్తుంది. మన పిల్లల్ని అలా కష్టాలలో, ఇరుకులులో, ఇబ్బంది లలో, నష్టాలలో, తలకు పైగా శోధనలు ఉన్నప్పటికీ నీ పిల్లలు ఆగిపోయే వారుగా కాక, అభివృధి చెందుతూ నష్టాల ఉపరితలముపైకి ఉబికి వచ్చేవారిగా చెయ్యాలని దేవుని తలంపు. అందుకే ప్రభువు యెషయా 44: 3 లో నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించేధను, నీకు పుట్టిన వారిని నేనాసిర్వధించేదను. మన సంతానాన్ని మన ప్రభువు దీవించి గొప్పవారిగా చేయును గాకా .
షలోమ్
అపోస్తులు నాని బాబు నెల్లి