ఒక సేవకుల సహవాసం లో కొంతమంది సేవకులు వారి మందిరాలు గురుంచి మాట్లాడుకుంటూ, మందిరాలలోనికి పురుగులు రావడం గురించి మాట్లాడుకుంటున్నారు. ఒక్కొక్కరు ఒక్కో విధముగా ఎంత ప్రయత్నాలు చేసినా పురుగులు పోవడం లేదని చెప్పుకుంటున్నారు. అయితే అక్కడ ఒక పాస్టర్ గారు మాత్రం అసలు ఏవిధమయిన చింత లేకుండా కుర్చుని ఉండటం చూసి మీకు పురుగులు బెడద లేదా అని అడిగారు. అందుకు పాస్టర్ గారు మీ అందరికంటే ఎక్కువ ఉండేవి, కాని ఇప్పుడు రావడం లేదు అన్నారు అట. అంతే అందరి చూపులు ఈ పాస్టర్ గారి వైపు తిరిగిపోయాయి. ఏమి చేసారు పురుగులు రాకుండా.. పాస్టర్ చాల ప్రశాంతంగా లోపలి వచ్చిన వాటికేల్ల బాప్తిస్మం ఇచ్చేస్తున్నాను. అన్నరంట... ఈరోజుల్లో సంఘం ఇలానే ఉంది.. దేవునిలోనికి వచ్చిన క్రొత్తలో అసలు మందిరం విడువకుండా ప్రార్ధనకు వచ్చేస్తారు... కాని బాప్తిస్మాలు పొందాక అసలు మందిరానికి రావడం మానేస్తుంటారు.... అందుకే వాక్యం చెపుతుంది. కొందరు మానుకోను చున్నట్టుగా సమాజముగా కూడుట మానక ...... ఆ దినము సమీపించుట మీరు చుసిన కొలది మరి ఎక్కువగా ఆలాగు చేయుచు.... హెబ్రీ 10:25, వీరు అపోస్తులుల బోధ యందును సహవాస మందును, రొట్టె విరచుట యందును ప్రార్ధన చేయుట యందును ఏడ తెగక యుండిరి. అపోస్తులు 2: 42. మనం ప్రభువు కోరుకునిన సంఘముగా విశ్వాసిగా, దేవుని బిడ్డగా ఉందాం...
షలోమ్
మీకొరకుప్రార్ధించే
అపోస్తులునెల్లినానిబాబు