యోహాను 21: 1-12 లో యేసు వారు పునరుధానుడై తన శిష్యులను కలవడానికి వెళ్తే వారు ఒక పర్యాయం గలలి సముద్రం లో చేపలు పడుతున్నారు. రాత్రి అంతా ప్రయాస పడ్డారు, కాని ఆ ఉదయాన్న అల్పాహారం గా తినడానికి కూడా ఒక్క చేప కూడా సంపాదించ లేకపోయారు. వారు ఆ వృత్తి వారే, చేపలు పట్టడం లో నైపుణ్యం గలవారే, సముద్రం యొక్క పరిస్థితులు తెలిసినవారే, చేపల యొక్క ఆను-పాను తెలిసిన వారే అయినా వారి ప్రయాస వృధా అయ్యింది. ఎందుకు అలా? యేసు వారు వారిని గలలి లో అయన కోసం వేచి ఉండమంటే, వారు చేపల కోసం ప్రయాస పడుతున్నారు. ఈరోజు యేసువారు నిన్ను కలిసే మందిరం లో ఉండమని చెపితే నీవు ఎక్కడ ఉన్నావు? దానికి ఫలితం, ఏమి లేదు, వారి నైపుణ్యం కూడా వారికి అక్కరకు రాలేదు. యేసు వారు వారిని చూసి కుడి ప్రక్కన వేయమని చెప్పగా వారు వల వేసి 153 చేపలు పట్టారు. అయితే వారి దగ్గర ఉన్న వల అన్ని చేపలు పట్టేది కాదు. వారి వలలు, నావలు వదిలి చాలా కలం అయ్యింది, అయితే ఆ వల ఎరువు తెచ్చుకున్నది అయివుంటుంది, వారు చిన్న వలను ఇచ్చి ఉండవచ్చు, ఎందుకంటే వాక్యం అర్ధం చేసుకుంటే ఆ చేపలు ఆ వలకు ఎక్కువ అనే అర్ధం వస్తుంది. అక్కడ వ్రాస్తూ " చేపలు అంత విస్తారముగా పడినను వల పిగలలేదు". యేసు వారు ఆసిర్వదిస్తే నీ ఆస్తిని దొంగాలు దొంగిలించలేరు, నీ సంచి చిల్లు పడదు, పాడు కాదు, నీకు ఉపయోగ కరముగా ఉంటుంది? సంపాదించుటకు యేసు వారు చూపిన మార్గాలు అనుసరిస్తే నీ కష్టార్జితమునీకు ఉపయుక్తముగా ఉంటుంది. యోబు చేతి పనిని అసిర్వదించగా ఆస్తి పరుడు అయ్యాడు, అబ్రహమును అసిర్వదిస్తే రాజుల మించిన ఆసిర్వాధమును పొందుకోగాలిగాడు. యేసు వారు నీ వల పగిలి పోనివ్వక మెండుగా దీవించును గాకా!
షలోమ్
మీకోరకు ప్రార్ధించే
అపోస్తులు నెల్లి నాని బాబు