దేవుని కార్యములు జరగడానికి విశ్వాసం అవసరం. అయితే ఒకే సంధర్బంలో ఒకో విధమయిన విశ్వాసం పని చేస్తుంది. అందులో ప్రముఖ్యమయినవి ౩. మొదటిది, దేవుని కార్యం చూడాలనుకుంటున్న వాని విశ్వాసం. అందుకే ప్రభువు వారు " నీ విశ్వాసమే నిన్ను స్వస్త పరచింది" అన్నారు. రెండవది, మధ్యవర్తి విశ్వాసం. అంటే ఒక వ్యక్తి పక్షాన మరో వ్యక్తి విశ్వాసం కలిగి ఉండటం. ఒకరోజు పక్షవాయు రోగం కలిగిన వ్యక్తిని యేసు వారు ఉన్న ఇంటి పైకప్పు విప్పి కిందకు దింపి నప్పుడు, ఆ రోగిని తీసుకుని వచ్చిన వారి విశ్వాసమును బట్టి ఆ రోగిని ప్రభువు స్వస్త పరిచారు. ఇది ఎక్కువ పర్యాయాలు, స్వస్థత పరచబడగోరె వ్యక్తి విశ్వాసాన్ని తెలియ పరచాలేనప్పుడు, దేవుని నామము మహిమ పరచబడుటకు అనుకూలమయిన సమయాలలో ఆసిర్వధకరం ఉంటుంది. మూడవది, ప్రార్ధించే వ్యక్తి విశ్వాసం. లాజరు చనిపోయినప్పుడు, లాజరు విశ్వాసాన్ని కనుపరచడానికి తను మరణ స్థితిలో ఉన్నాడు. తన్న అక్కలు విశ్వాసం మృతుల పునరుద్ధానం రోజున తమ్ముడు లేస్తాడు అని ఉంది గాని అప్పటి కార్యం మీద లెదు. అయితే యేసువారు విశ్వాసంతో ప్రార్ధించగా లాజరు బ్రతికాడు. మూడవ విశ్వాసం ఎక్కువ పర్యాయం దేవుని చిత్తానికి లోబడి ప్రార్ధించే విషయాలలో జరుగుతుంది. ఇరోజు దేవుడు నిన్ను స్వస్త పరచాడు అంటే అది ఎవరి విశ్వాసమో తెలుసుకో? నీలో విశ్వాసము ఎంతవరకు ఉందో గమనించుకో. దేవుడు నీకు బలమయిన విశ్వాసము కలుగజేయును గాక!
షలోమ్
మీకోరకు ప్రార్ధించే
అపోస్తులు నెల్లి నాని బాబు