ఒక రోజు ఒక యోవనస్తుడు సముద్రపు ఒడ్డున నడుచుకుంటు వెళ్తున్నాడు. మనసులో ఎందుకో ఆలోచన వచ్చింది నేను ఒంటరిగా ఉన్నాను అని. అయితే ప్రార్ధన చేస్తున్నాడు ప్రభువా నేను ఒంటరివాడను అని. ప్రభువు వాని తో మాట్లాడుతూ వెనకకు చూడు అన్నారు. అధ్బుతంగా అతని అడుగుల జాడల పక్కన మరో వ్యక్తి అడుగుల జాడలు కనపడుతున్నాయి. అవి ఎవరివి ప్రభువా అని అడిగితే నేను నీకు తోడై ఉన్నాను, నీ ప్రక్కనే ఉన్నాను నడుస్తున్నాను అన్నరంట. కొంచెం దురం వెళ్ళగానే అక్కడ ఒక బోర్డ్ మీద ఇది ప్రమాధకర ప్రదేశం, దొంగ ఉబి ఉన్న ప్రాంతం అని వ్రాసి ఉంది అంట. అయితే అప్పటికే అతడు అది ధాటి వచ్చేసాడు. దేవుడు చెప్పిన మాట గుర్తుకు వచ్చి వెనకకు చూడగా ఒక్క వ్యక్తి అడుగులు మాత్రమే కనబడుతున్నాయి. దేవునిని సంకించడం మొదలు పెట్టాడు. ఎందుకు దొంగ ఉబి ఉన్న చోటను నన్ను వదిలేసావు? అని దేవుని ప్రశ్నించగా, దేవుడు, కనపడుతున్న ఆ జాడలు నీవి కావు నావి, నిన్ను ఎత్తుకుని వచ్చాను అన్నరంట. దేవుని వాక్యం చెపుతుంది. అపోస్తులు 10:27 లో ఆయన మనలో ఎవనికిని దూరముగా ఉండువాడు కాదు. alage కీర్తనలు 119:151 లో యెహోవ, నీవు సమీపముగా ఉన్నావు. అని దావీదు మాట్లాడుతున్నాడు. అందుకునేమో 23 వ కీర్తనలో గడాందకార లోయలలో సంచరించిన ఏ అపాయమునకు బయపడను అంటాడు. అందుకునే షడ్రకు మేషేకు అబెద్నేగో లు అగ్ని గుండములోనికి వెళ్లడానికైనా సిద్ధపడ్డారు. ఈరోజు నీతో ప్రభువు వారు ఉన్నారని ధైర్యముగా ఉండు. భయమును విడిచి పెడదాము. అట్టి కృప నీకు కలుగును గాక!
షలోమ్
మీకొరకుప్రార్ధించే
అపోస్తులునెల్లినానిబాబు