మన భారత దేశం లో ఎక్కువ శాతం ప్రజలు బాధ పడుతున్న రోగం ఒకటి ఉంది. చాల విచిత్రమైన రోగం. దానికి ఒక ఉదాహరణ చెపుతాను. నేను రెండు సంవత్సరాల క్రితం LKG చదువుతున్న పిల్లల తండ్రులు చాల మందికి KG - PG ఫ్రీ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ స్కీమ్ గురుంచి చెప్పాను. చెపుతూ నోటిఫికేషన్ వచ్చినప్పుడు చుడండి, చూసి నాకు కుడా చెప్పండి. నా కుమారుడు కూడా LKG చదువుతున్నాడు. అని అడిగాను. అలాగే అన్నారు. మొదటి తరగతిలో జాయిన్ చెయ్యాల్సిన సమయం వచ్చింది. నేను ఎవరికైతే స్కీమ్ గురుంచి చెప్పానో వాళ్ళందరికీ ఫోన్ చేసి నోటిఫికేషన్ పడిందా అని అడుగు తుంటే అందరు మా పిల్లల్ని పలానా స్కూల్ లో జాయిన్ చేసాము, మాకు సిటు వచ్చింది అని చెప్పడం మొదలెట్టారు. అప్పుడు అర్ధం అయ్యింది అవకాసం చేతులు జారిపోయింది అని. తన ధనం వ్యయం చెయ్యడం లేడు, తనకు ఏవిధమైన నష్టం వాట్టిల్లదు అయినా ప్రభుత్వం వారే ఇచ్చే ఉచిత విద్య గురుంచి పక్క వ్యక్తికి చెప్పడానికి మనసు రాలేదు. ఇది మచ్చుకు మాత్రమే ఇలా ఎన్ని విషయాలలో తనకు తెలిసిన విషయాన్ని ఇతరులకు పంచుతున్నారు. ఇది మన దేశం లో మాత్రమే కనిపించే వింత వ్యాధి. ఈ వ్యాధి ఉండటం వలననే మొదటి శాతబ్దం లోనే సువార్త భారత దేశనికి వచ్చినా ఇంకా అన్య దేశంగా ఉండి పోవలసి వచ్చింది. ఇంకా ౩ శాతం మాత్రమే క్రీస్తు ను అంగీకరించారు, రక్షింప బడ్డారు. అందుకే ఆరోగ్య వంతుడైన క్రైస్తవుడు ప్రతి రోజు చెయ్యాల్సిన ఒక వ్యాయామం సువార్తను ప్రకటించుట. కీర్తనలు 96:2 లో పరిశుద్ధాత్ముడు ఇలా వ్రాయించాడు. అనుదినము రక్షణ సువార్తను ప్రకటించుడి. మరోచోట యేసు వారు అంటారు, ఉచితం గా పొందిరి ఉంచితంగా ఇయ్యుడి. మనం పొందుకున్న రక్షణ ఇతరులు కూడా పొందాలి కదా... నీ బంధువులు, స్నేహితులు, ఇరుగు పొరుగు వారు నరకానికి వెళ్లి పోవల్సిందేనా... వాళ్లకు నిత్య జీవము, రక్షణ గురుంచి చెప్పవా.. ఒక రోజు ఏసు వారు లెక్క అడిగితే చెప్పగలవా సమాధానము... రోజుకి ఒక్క వ్యక్తి అయిన యేసును పరిచయం చెయ్యి...
దేవుడు మిమ్మును దివించును గాకా!
మీ ఆత్మీయ అభివృద్ధి కోరి ప్రార్ధించే
అపోస్తులు నాని బాబు నెల్లి